astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

అవాంత‌రాలు తొల‌గిపోవాలంటే..కాస్త ఆగి, ఈ ప‌ని చేసి చూడండి..!

అవాంత‌రాలు ఏర్ప‌డితే ఏ ప‌ని అయినా ఆగిపోతుంది. విఘ్నాలు ఏర్ప‌డితే ఏ కార్య‌మూ ముందుకు న‌డ‌వ‌దు.
ఇప్పుడు భాద్ర‌ప‌ద మాసం వ‌చ్చేసింది. నాలుగు రోజుల్లో వినాయ‌క చ‌వితి వ‌చ్చేస్తోంది. వినాయ‌క స్వామిని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొల‌వ‌టం మ‌రిచిపోకండి.

**ప్ర‌స‌న్న వ‌ద‌నం ధ్యాయేత్‌, స‌ర్వ విఘ్నోప‌శాంత‌యే** అని చెబుతారు. వినాయ‌కుడ్ని కొలిస్తే విఘ్నములు తొల‌గిపోతాయ‌న్న‌ది న‌మ్మిక. అందుకే వినాయ‌క చ‌వితి రోజు మ‌రిచిపోకుండా ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించాలి. ఉద‌య‌మే నిద్ర లేచి ఒక్క‌సారి వినాయ‌కుడ్ని మ‌న‌సులో ధ్యానించండి . త‌ర్వాత శుచిగా స్నానం చేసి మ‌ట్టితో గ‌ణ నాథుడి ప్ర‌తిమ త‌యారుచేసుకోండి. ఇంటిల్లి పాదిని క‌లుపుకొని పూజా మందిరంలో పూజ‌ను ఆచ‌రించండి. షోడశోప‌చారముల‌తో పూజించ‌టం ఆన‌వాయితీ. షోడ‌శ అంటే 16 ర‌క‌ములైన ఉప‌చార‌ములు చేయ‌టం అన్న మాట‌. ధ్యానావ‌హ‌నాది ఉప‌చార‌ములు చేసి ప‌త్రితో పూజించాలి. ఏక వింశ‌తి ప‌త్రాలు అంటే 21 ర‌కాల ప‌త్రుల్ని వీలైతే సేక‌రించుకొని, లేదంటే కొన్ని ర‌కాల ప‌త్రుల‌తో అయినా స్వామిని పూజ చేయాలి. చ‌క్క‌గా క‌థ చెప్పుకొని విని ప్ర‌సాదాన్ని పంచి తాము కూడా తీసుకోవాలి. వినాయ‌క చ‌వితి రోజు పుస్త‌కాలు అక్క‌డ పెట్టి పూజించ‌టం ఆన‌వాయితీ. చ‌దువు బాగా రావాల‌ని కోరుకొంటూ పిల్ల‌ల చేత ఈ పూజ చేయంచ‌టం మ‌ర‌వ‌కండి. చక్క‌గా ఈ పూజ చేసుకొంటే అవాంత‌రాలు తొల‌గ‌టం ఖాయం.

No comments:

Post a Comment