మొక్కలు పెంచటం మంచిది కాదని ఎవరైనా చెబితే దాన్ని నమ్మవద్దు. మొక్కల్ని పెంచటం, చెట్లు పెట్టడం అన్నది హైందవ సంస్కృతిలో ఒక భాగం. దీన్ని అలవాటుగా చేసుకొనేందుకు ఒక్కో నక్షత్రానికి ఒక్కో మొక్కను సూచించటం జరిగింది. కనీసం దీని కారణంగా అయినా ప్రతీ మనిషి ఒక చెట్టును పెంచుతారని భావన. అంత అంతరార్థంతో చెట్లు పెంచటాన్ని ప్రోత్సహించిన సంస్కృతి మనది.
విష్ణుమూర్తి తులసీ దళం రూపంలో శోభిల్లుతాడని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ మొక్కలు ఎంతో ఔషధ గుణాలు కల్గి ఉన్నాయి. అటువంటి విలువైన మొక్కల్ని పెంచటం, ఆయా ఆకుల్ని ఉపయోగించటం వలన ఔషధ గుణాలు లభిస్తాయి. అందుచేత ఇటువంటి మొక్కలు, పత్రాల వినియోగాన్ని ప్రోత్సహించటం జరిగింది. అదే సమయంలో పత్తి వంటి మొక్కల్ని పెంచటం మంచిది కాదంటారు. దీనికి కారణం ఏమిటంటే పత్తి నుంచి వచ్చే దూది ఎగిరి కళ్లకు ఇబ్బంది కల్గిస్తుంది కాబట్టి ఆ రకంగా చెబుతారు తప్పితే మొక్కల పెంచటం సరైన చర్యే అని గుర్తుంచుకోవాలి.
what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
ReplyDeletemy youtube channel garam chai:www.youtube.com/garamchai