పసుపు తో వినాయకుడ్ని తయారుచేసుకొని పూజ చేసుకొంటుంటాం. కేవలం వినాయకుడ్నే ఈ రూపంలో పూజ చేసుకొంటాం. ప్రతీ పూజకు, శుభ కార్యాలకు ముందు గణపతి పూజ తప్పనిసరి. ఆఖరికి వినాయక వ్రతం చేసే ముందు కూడా పసుపుతో చేసిన గణపతికి అర్చించుకొంటాం. విఘ్నాలు ఏర్పడకుండా ఉండాలని, తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుకొంటూ ఈ పసుపు వినాయకుడ్ని అర్చించుకోవటం ఆనవాయితీ.
వాస్తవానికి పసుపు తో వినాయకుడ్ని చేయటంపై భిన్న కథనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది త్రిపురాసుర సంహారానికి సంబంధించినది. ఆ సమయంలో నందీశ్వరుడి మూడో కొమ్ము అయిన పసుపు కొమ్ము పడిపోయినది. అది ఎక్కడకు పోయిందో అని ఆందోళన చెందుతున్న సమయంలో దీన్ని ... సూక్ష్మ బుద్ది గలిగిన వినాయకుడు వెదకి తెచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత వినాయకుడిని పసుపు ముద్ద రూపంలో పూజిస్తే ఎటువంటి కార్యమైనా నెరవేరుతుందని వరం ఇచ్చినట్లు చెబుతారు. అప్పటినుంచి వినాయకుడ్ని పసుపు ముద్ద రూపంలో అర్చించటం ఆనవాయితీ గా వస్తోంది. అందుచేత భక్తి శ్రద్ధలతో వినాయకుడ్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
వాస్తవానికి పసుపు తో వినాయకుడ్ని చేయటంపై భిన్న కథనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది త్రిపురాసుర సంహారానికి సంబంధించినది. ఆ సమయంలో నందీశ్వరుడి మూడో కొమ్ము అయిన పసుపు కొమ్ము పడిపోయినది. అది ఎక్కడకు పోయిందో అని ఆందోళన చెందుతున్న సమయంలో దీన్ని ... సూక్ష్మ బుద్ది గలిగిన వినాయకుడు వెదకి తెచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత వినాయకుడిని పసుపు ముద్ద రూపంలో పూజిస్తే ఎటువంటి కార్యమైనా నెరవేరుతుందని వరం ఇచ్చినట్లు చెబుతారు. అప్పటినుంచి వినాయకుడ్ని పసుపు ముద్ద రూపంలో అర్చించటం ఆనవాయితీ గా వస్తోంది. అందుచేత భక్తి శ్రద్ధలతో వినాయకుడ్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.
No comments:
Post a Comment