ఆశ్వయుజ మాసం రానే వచ్చింది. శరన్నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించే సమయం ఇది. వీలు కొలదీ దేవాలయంలో కానీ, ఇంటి దగ్గర కానీ, మందిరంలో కానీ అమ్మ వారి పూజ చేసుకొంటే మంచిది. సాధ్యం అయితే సమూహంతో లేదా ఇంటిల్లి పాది కలిసి లేదా ఒంటరిగా అయినా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజలో నిబంధనల కన్నా భక్తికి ప్రాధాన్యం అని గుర్తించుకోవాలి.
అమ్మ వారి అర్చన కు ఉదయం కానీ, సాయంత్రం కానీ విశేష సమయం. శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి ఆరాధనకు సంకల్పించాలి. అమ్మ వారికి షోడశ ఉపచారాలు సమర్పించి పూజ చేసుకోవచ్చు. శ్రీ సూక్త విధానంగానూ పూజ చేయవచ్చు. ఆ తర్వాత అమ్మ వారికి కుంకుమార్చన చేస్తే మేలు. లలితా సహస్రం కానీ, త్రిశతి కానీ, ఖడ్గమాల కానీ జపిస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తే మంచిది. ఆ తర్వాత అమ్మ కు ప్రీతిగా నైవేద్యాలు సమర్పించి ప్రసాదం పంచాలి. అమ్మ వారి ఆరాధనతో అన్నీ సమకూరుతాయన్నది భక్తుల నమ్మిక. ఏడాది పొడవునా చేసిన అర్చన ఒక ఎత్తయితే, ఈ నవరాత్రుల్లో చేసిన అర్చన ఒక ఎత్తు. అందుచేత భక్తి శ్రద్ధలతో ఈ అర్చన చేయటం మంచిది.
అమ్మ వారి అర్చన కు ఉదయం కానీ, సాయంత్రం కానీ విశేష సమయం. శుచిగా స్నానం ఆచరించి అమ్మవారి ఆరాధనకు సంకల్పించాలి. అమ్మ వారికి షోడశ ఉపచారాలు సమర్పించి పూజ చేసుకోవచ్చు. శ్రీ సూక్త విధానంగానూ పూజ చేయవచ్చు. ఆ తర్వాత అమ్మ వారికి కుంకుమార్చన చేస్తే మేలు. లలితా సహస్రం కానీ, త్రిశతి కానీ, ఖడ్గమాల కానీ జపిస్తూ అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తే మంచిది. ఆ తర్వాత అమ్మ కు ప్రీతిగా నైవేద్యాలు సమర్పించి ప్రసాదం పంచాలి. అమ్మ వారి ఆరాధనతో అన్నీ సమకూరుతాయన్నది భక్తుల నమ్మిక. ఏడాది పొడవునా చేసిన అర్చన ఒక ఎత్తయితే, ఈ నవరాత్రుల్లో చేసిన అర్చన ఒక ఎత్తు. అందుచేత భక్తి శ్రద్ధలతో ఈ అర్చన చేయటం మంచిది.