భాద్రపద మాసం వేగంగా గడిచిపోతోంది. ఇప్పటికే శుక్ల పక్షం సగం రోజులు గడచిపోయాయి. నాలుగు రోజుల్లో పౌర్ణమి వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణ పక్షానికి ప్రాధాన్యం ఉంది.
మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరాలన్నా, చక్కగా స్థిర పడాలన్నా పెద్దల ఆశీర్వాదం తప్పనిసరి. ముఖ్యంగా పితృ దేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదించటం ముఖ్యం. అందుకే పెద్దలు స్వర్గస్తులయిన రోజున (వర్ధంతి) గుర్తు ఉంచుకొని వారి పేరుతో ఆబ్దికం పెట్టడం లేదా పుణ్య కర్మలు ఆచరించటం లేదా ప్రార్థనలు చేయటం చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే పెద్దలు అందరినీ ఒక రోజు గుర్తు చేసుకొనేందుకు మహాలయ పక్షాలు అనే ఏర్పాటు చేశారు. అంటే ఈ భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలో నిర్దిష్ట మైన రోజును సరి చూసుకొని ఈ పని ఏర్పాటు చేసుకోవాలి. ఆరోజున ఒక పుణ్య కర్మ చేసే విధంగా మలచుకోవచ్చు. మంత్ర సమాప్తిగా భోజనం పెట్ట వచ్చు లేదా పూజలు చేసుకోవచ్చు. కనీసం నిరుపేదలకు దానం చేయవచ్చు. ఆరోజు చేపట్టే పుణ్య కర్మలు విశేషంగా ఫలిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత మహాలయ పక్షాలు పాటించటం మంచిది. కొందరు మాత్రం ఇది ఆనవాయితీ లేదని చెబుతుంటారు. కానీ ఇటువంటి మంచి పని మొదలు పెట్టడమే ఆనవాయితీ అవుతుందని గుర్తుంచుకోవాలి.
మనం జీవితంలో ఉన్నత స్థితికి చేరాలన్నా, చక్కగా స్థిర పడాలన్నా పెద్దల ఆశీర్వాదం తప్పనిసరి. ముఖ్యంగా పితృ దేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదించటం ముఖ్యం. అందుకే పెద్దలు స్వర్గస్తులయిన రోజున (వర్ధంతి) గుర్తు ఉంచుకొని వారి పేరుతో ఆబ్దికం పెట్టడం లేదా పుణ్య కర్మలు ఆచరించటం లేదా ప్రార్థనలు చేయటం చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే పెద్దలు అందరినీ ఒక రోజు గుర్తు చేసుకొనేందుకు మహాలయ పక్షాలు అనే ఏర్పాటు చేశారు. అంటే ఈ భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలో నిర్దిష్ట మైన రోజును సరి చూసుకొని ఈ పని ఏర్పాటు చేసుకోవాలి. ఆరోజున ఒక పుణ్య కర్మ చేసే విధంగా మలచుకోవచ్చు. మంత్ర సమాప్తిగా భోజనం పెట్ట వచ్చు లేదా పూజలు చేసుకోవచ్చు. కనీసం నిరుపేదలకు దానం చేయవచ్చు. ఆరోజు చేపట్టే పుణ్య కర్మలు విశేషంగా ఫలిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత మహాలయ పక్షాలు పాటించటం మంచిది. కొందరు మాత్రం ఇది ఆనవాయితీ లేదని చెబుతుంటారు. కానీ ఇటువంటి మంచి పని మొదలు పెట్టడమే ఆనవాయితీ అవుతుందని గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment