astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

క‌నీసం ఈ సోమ‌వారం అయినా ప్రయ‌త్నించండి..!

సోమ‌వారం వ‌చ్చిందంటే ఒక మంచి అనుభూతి.. ఎందుకంటే ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అది. మాసాల్లో కార్తీక మాసం త‌ర్వాత అంత‌టి విశిష్టమైన మాసం మాఘ‌మాసం. ఈ సోమ‌వారం స‌ప్తమి తిథి తో క‌లిసి ఉన్నది కాబ‌ట్టి దేవ‌తారాధ‌న‌కు మంచి రోజు. ప‌ర‌మేశ్వరుడ్ని అర్చించుకొనేందుకు,సూర్య భ‌గ‌వానుడ్ని ఆరాధించుకొనేందుకు ఇది మంచి స‌మ‌యం. ఉద‌య‌మే లేచి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి.
కరాగ్రే వసతే లక్ష్మీః,
కర మధ్యే సరస్వతీ,
కరమూలే స్థితో బ్రహ్మా,
ప్రభాతే కర దర్శనం
                చేతి అగ్ర భాగము-ముందు లక్ష్మీ దేవివసించి యున్నది.చేతి మధ్య భాగమునందు చదువుల తల్లి సరస్వసతీ దేవివిరాజిల్లుతున్నది.చేతి మూలమునందు బ్రహ్మ దేవుడు నివసించియున్నాడు.కావున ప్రాతఃకాలమునందూ ఇట్టి దివ్యమైన భావముతో రెండు చేతులను దర్శించాలి.ఆ పిదప
సముద్ర వసనే దేవి!
పర్వతస్తన మండలే,
విష్ణు పత్ని నమస్తుభ్యం,
పాదస్పర్శం క్షమస్వమే!
సముద్రము వంటి వస్త్రములను ధరించినట్టి,పర్వత స్వరూప స్తనములతో,శ్రీ విష్ణు భగవానుని పత్నియగు ఓ పృధ్వీ దేవీ నీవు దయతో నా పాద స్పర్శను క్షమింపుము.అని భూ మాతను క్షమాపణ పూర్వకంగా ప్రార్ధించాలి. ఆత‌ర్వాత శాస్త్ర ప్రకారం స్నానం చేసి, చ‌క్కగా దేవ‌తారాధ‌న‌కు పూనుకోవాలి. ఈ రోజున ఆదిత్యుడ్ని పూజించుట మేలు. ఆదిత్య హృద‌యం పారాయణంతో ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి.

రాగి పాత్రలో గరిక, పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్థంతో సూర్య నారాయణ స్వామికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం ఇస్తే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగభాగ్యాలిచ్చి వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయిష్సు ప్రసాదిస్తారని నమ్మకం. భక్తులు మరణానంతరం సూర్యలోకం చేరుతారని  చెబుతారు. ఆ త‌ర్వాత ప‌ర‌మేశ్వరుడ్ని మారేడు ప‌త్రాలు, పుష్పాల‌తో అర్చించుకోవాలి. ప‌ర‌మేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబ‌ట్టి మ‌న‌సా, వాచా భ‌క్తితో అభిషేకం, అర్చన చేసుకోవచ్చు. ఇటువంటి విశిష్టమైన రోజున ఉప‌వాసం చేయ‌వ‌చ్చు. అంటే ఇది ఆరు ర‌కాలు ఉన్నప్పటికీ, ఏక‌భుక్తం మేలు. ఏకభుక్తం (ఒంటిపూట) చేస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉబ్బసరోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు, నరాల వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. తెల్లజిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులకు, రేగు పళ్లకి, సౌరశక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా వుంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే రథసప్తమి రోజున శిరస్సు మీద, భుజాలు మీద తెల్ల జిల్లేడు ఆకులు, రేగుపళ్లు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

No comments:

Post a Comment