తెలంగాణ మీద కేంద్ర మంత్ర వాయలార్ రవి అన్న కామెంట్ ఇది. దోశ వేయటం అన్నంత తేలిక కాదు. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయన చెప్పదలుచుకొన్న అంశం.. తెలంగాణ విషయం పరిష్కారం క్లిష్టమైనది అని చెప్పటమే. ఇందుకోసం ఆయన అన్న కామెంట్ ఎన్నో లక్షల మందిని కలవర పరిచింది. అంటే ఒక వాక్యాన్ని పెద్ద స్థాయిలో ఉన్న వారు అనటం వలన లక్షల మందిలో ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించింది. ఎందుకని.. అదే కేంద్ర మంత్రి తెలంగాణ సెంటిమెంట్ చాలా మందిలో బలం గా ఉన్నందున, అటు సమైక్య వాదంపై సీమాంధ్ర లో వాదన వినిపిస్తున్నందున .. దీనిపై తేల్చటం కష్టతరం అవుతోంది అని చెబితే ఎవరికీ ఇబ్బంది కలిగేది కాదు. కానీ కేంద్ర మంత్రి ఒక వాక్యంలో చేసిన కామెంట్ తో పేపర్లలో మొదటి పేజీ వార్తలు, టీవీ చానెల్స్ లో ప్రైమ్ టైమ్ డిస్కషన్ లు నడుస్తున్నాయి.
అదే మాటలో ఉండే మహిమ. కొన్ని అక్షరాల్ని కలిపి పదాలు, పదాల్ని కలిపిన వాక్యాల్ని వాడినప్పుడు కలిగే ప్రభావం ఇది.
మంత్ర శాస్త్రంలో ఉండే మహిమ కూడా ఇదే. మంత్రాల్ని స్వరయుక్తంగా శాస్త్ర బద్దంగా ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. ఎందుకంటే మంత్రాల ద్వారా వెలువడే వైబ్రేషన్స్ శక్తి మంతంగా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నట్లు గా గ్రహాల అశుభ దృష్టి తాకుతున్నప్పుడు పరిష్కారం గా మంత్ర జపం చెబుతారు. అంటే ఏమిటి.. ఆ గ్రహానికి ఇష్టమైన మంత్రాన్ని అనేక సార్లు అంటే వందలసార్లు, వేల సార్లు జపించమంటారు. దీని కారణంగా ఆ గ్రహానికి ప్రీతి కలిగి మేలు కలుగుతుంది. ఇష్టంలేని వాక్యాన్ని ఒక్కసారి పలికితే ఎంతటి కలవరం కలిగిందో ఇందాక ఉదాహరణలో చూశాం. అదే ఇష్టమైన వాక్యం పలికితే అంతే స్థాయిలో ఆనందం కలుగుతుంది. నచ్చిన వ్యక్తి మనదగ్గరకు వచ్చి ఐ లైక్ యూ అని చెబితే పొంగి పోతాం. మీరు మంచి వారు, మీరు చక్కటి వారు అని చెబితే సంతోషిస్తాం.అదే మాట వందల సార్లు, వేల సార్లు చెబితే ఎంతటి సంతోషం కలుగుతుంది ..
ఇక అదే మంత్రాలను సుస్వర యుక్తంగా సుసంపన్నం చేయవచ్చు. పదం రూపంలో, క్రమ రూపంలో, జఠ రూపంలో, ఘన రూపంలో చెబితే కలిగే వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదు. ఈ వైబ్రేషన్స్ ద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదే లాజిక్ ను జ్యోతిష శాస్త్రం అప్లయ్ చేస్తుంది. చక్కటి పరిష్కారాన్ని చూపటం ద్వారా మానవ జీవితానికి జ్యోతి మాదిరిగా వెలుగు చూపేదే జ్యోతిష్ శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు..
అదే మాటలో ఉండే మహిమ. కొన్ని అక్షరాల్ని కలిపి పదాలు, పదాల్ని కలిపిన వాక్యాల్ని వాడినప్పుడు కలిగే ప్రభావం ఇది.
మంత్ర శాస్త్రంలో ఉండే మహిమ కూడా ఇదే. మంత్రాల్ని స్వరయుక్తంగా శాస్త్ర బద్దంగా ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. ఎందుకంటే మంత్రాల ద్వారా వెలువడే వైబ్రేషన్స్ శక్తి మంతంగా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నట్లు గా గ్రహాల అశుభ దృష్టి తాకుతున్నప్పుడు పరిష్కారం గా మంత్ర జపం చెబుతారు. అంటే ఏమిటి.. ఆ గ్రహానికి ఇష్టమైన మంత్రాన్ని అనేక సార్లు అంటే వందలసార్లు, వేల సార్లు జపించమంటారు. దీని కారణంగా ఆ గ్రహానికి ప్రీతి కలిగి మేలు కలుగుతుంది. ఇష్టంలేని వాక్యాన్ని ఒక్కసారి పలికితే ఎంతటి కలవరం కలిగిందో ఇందాక ఉదాహరణలో చూశాం. అదే ఇష్టమైన వాక్యం పలికితే అంతే స్థాయిలో ఆనందం కలుగుతుంది. నచ్చిన వ్యక్తి మనదగ్గరకు వచ్చి ఐ లైక్ యూ అని చెబితే పొంగి పోతాం. మీరు మంచి వారు, మీరు చక్కటి వారు అని చెబితే సంతోషిస్తాం.అదే మాట వందల సార్లు, వేల సార్లు చెబితే ఎంతటి సంతోషం కలుగుతుంది ..
ఇక అదే మంత్రాలను సుస్వర యుక్తంగా సుసంపన్నం చేయవచ్చు. పదం రూపంలో, క్రమ రూపంలో, జఠ రూపంలో, ఘన రూపంలో చెబితే కలిగే వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదు. ఈ వైబ్రేషన్స్ ద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదే లాజిక్ ను జ్యోతిష శాస్త్రం అప్లయ్ చేస్తుంది. చక్కటి పరిష్కారాన్ని చూపటం ద్వారా మానవ జీవితానికి జ్యోతి మాదిరిగా వెలుగు చూపేదే జ్యోతిష్ శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు..
No comments:
Post a Comment