రేపటి ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. మాఘపు ఆదివారం అంటే సూర్య భగవానుడి అర్చనకు ఎంతో ప్రాశస్త్యమైనది. ప్రతీ మాఘ ఆదివారం నాడు వేకువ జామునే లేచి సూర్యోదయం అయిన పిమ్మట ఎండ తగిలే చోట సూర్యుడ్ని ఆవాహన చేసుకొని పూజలు చేసుకొంటారు. ఈఏడాది రథ సప్తమి కూడా ఆదివారం నాడే వచ్చింది. దీంతో సూర్యుడ్ని ఆరాధించటానికి మరింత మంచి సమయం వచ్చిందనుకోవచ్చు.
రథ సప్తమి రోజు న వీలుంటే నదీ స్నానం ఆచరించటం మేలు. లేని పక్షంలో ఇంటిలోనే వేకువ జామున స్నానం చేయాలి. ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి
॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥
॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥
॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥
అనంతరం ప్రశాంతంగా సూర్య దేవుడ్ని అర్చించుకోవాలి. చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, చిక్కుడు పువ్వులతో పూజ చేస్తారు. పాయసం వండి వేడి వేడిగా సూర్యుడికి నివేదన చేస్తారు. రథ సప్త మి రోజు ఉదయం పూజతో పనులు ప్రారంభిస్తే మంచింది. ఈ సమయంలో ఆదిత్య హృదయం పారాయణం చాలా మంచిది. ఆదిత్య హృదయం విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. రామాయణ కాలంలో రామచంద్ర ప్రభువు దీంతో ప్రభావితం అయినట్లు చెబుతారు. ఆదిత్య హృదయం పారాయణం తో రోగాలు నివారణ అవుతాయని, మానసికంగా ధైర్యం కలుగుతుందని భక్తుల నమ్మిక. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆదిత్య హృదయం పారాయణ మరిచిపోవద్దు.
రథ సప్తమి రోజు న వీలుంటే నదీ స్నానం ఆచరించటం మేలు. లేని పక్షంలో ఇంటిలోనే వేకువ జామున స్నానం చేయాలి. ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి
॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥
॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥
॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥
అనంతరం ప్రశాంతంగా సూర్య దేవుడ్ని అర్చించుకోవాలి. చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, చిక్కుడు పువ్వులతో పూజ చేస్తారు. పాయసం వండి వేడి వేడిగా సూర్యుడికి నివేదన చేస్తారు. రథ సప్త మి రోజు ఉదయం పూజతో పనులు ప్రారంభిస్తే మంచింది. ఈ సమయంలో ఆదిత్య హృదయం పారాయణం చాలా మంచిది. ఆదిత్య హృదయం విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. రామాయణ కాలంలో రామచంద్ర ప్రభువు దీంతో ప్రభావితం అయినట్లు చెబుతారు. ఆదిత్య హృదయం పారాయణం తో రోగాలు నివారణ అవుతాయని, మానసికంగా ధైర్యం కలుగుతుందని భక్తుల నమ్మిక. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆదిత్య హృదయం పారాయణ మరిచిపోవద్దు.
No comments:
Post a Comment