రాగల పది, పదిహేను రోజుల్లో హైదరాబాద్ లో సందడి నెలకొంటోంది. ఇప్పటికే శ్రావణ మాసం చివరికి వచ్చేస్తున్నాం. భాద్ర పద మాసంలో వచ్చే వినాయక చవితి కోసం సందడి మొదలైంది. వినాయక విగ్రహాల తయారీ పెద్ద ఎత్తున సాగుతోంది. వినాయక ప్రతిమలు తెచ్చుకొని వాటిని భక్తి శ్రద్దలతో పూజించుకొనేందుకు భక్తులు ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే ఈ సారైన మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి రసాయనాలతో చేసిన ప్రతిమలు చూసేందుకు ఆకర్షనీయంగా ఉండవచ్చు గాక, కానీ పర్యావరణ రీత్యా ఆలోచిస్తే మాత్రం మట్టి విగ్రహాలు మాత్రమే ఉత్తమం అని చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహకులు మట్టి ప్రతిమలకు ఆర్డర్ ఇస్తే ఉభయ తారకంగా ఉంటుంది.
అయితే ఈ సారైన మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి రసాయనాలతో చేసిన ప్రతిమలు చూసేందుకు ఆకర్షనీయంగా ఉండవచ్చు గాక, కానీ పర్యావరణ రీత్యా ఆలోచిస్తే మాత్రం మట్టి విగ్రహాలు మాత్రమే ఉత్తమం అని చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మండపాల నిర్వాహకులు మట్టి ప్రతిమలకు ఆర్డర్ ఇస్తే ఉభయ తారకంగా ఉంటుంది.
No comments:
Post a Comment