astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

జ్యోతిషం ప్రాశ‌స్త్యం..!

వేదాలు ప్రసాదించిన అద్భుత శాస్త్రముల‌లో జ్యోతిష శాస్త్రం ఒక‌టి. అందుకే దీన్ని జ్యోతిర్వేదం అని కూడా అంటారు. ప్రాచీన భార‌తీయ విజ్ఞాన‌ముల‌లో ఇది అగ్రగ‌ణ్యమైన‌ది. ఈ విజ్ఞానాన్ని రుషి ప‌రంపర నుంచి తాళ‌ప‌త్ర గ్రంధాల‌లోకి అక్కడ నుంచి సంస్కృత వాజ్ఞయంలోకి ప్రవ‌హించింది. దీని నుంచి మ‌న ప్రాచీనులు ఎంతో శ్రమ‌కోర్చి ఇప్పటి త‌రానికి అందిస్తూ వ‌చ్చారు. ఈ అద్భుత విజ్ఞానంపై ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. విదేశీయులు సైతం ఆస‌క్తిగా దీన్ని అభ్యసిస్తున్నారు.

 ఈ ప్రాచీన విజ్ఞానంలోని అద్భుత ఫ‌లితాల్ని ఎంద‌రో చ‌వి చూశారు. అప్పట్లో రాజుల కొలువులో ఆస్థాన మంత్రి, ఆస్థాన వైద్యుల తో పాటు ఆస్థాన జ్యోతిషులు కూడా ఉండేవార‌ట‌. వాతావ‌ర‌ణం, పంట‌లు, స్థితిగ‌తుల్ని అన్నింటినీ ఆ శాస్త్ర వేత్తలు అంచ‌నా వేసి చెప్పగ‌లిగే వార‌ట‌.  ప‌రాశ‌రుడు, వ‌రాహ మిహిరుడు వంటి మ‌హానుభావులు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని లోతుగా మ‌ధించి స‌రళీకరించి అనేక గ్రంథాలు వెలువ‌రించారు. ఈ సాహిత్యంలో చాలా భాగం కాల‌గ‌మ‌నంలో క‌లిసి పోయింది. కొద్ది పాటి శాస్త్ర అంశాల్ని మాత్రం అందుకోగ‌లిగాం. ఈ విజ్ఞానానికే ఆధునిక ప‌రిస్థితుల్ని రంగ‌రించి మ‌న పెద్దలు అభివృద్ధి ప‌రుస్తూ వ‌చ్చారు. త‌ర్వాత కాలంలో దీని నుంచి అనేక శాఖ‌లు ఉద్భవిస్తూ వ‌చ్చాయి. వీటి వివ‌రాలు క్రమంగా చ‌ర్చిద్దాం...

1 comment: