వేదాలు ప్రసాదించిన అద్భుత శాస్త్రములలో జ్యోతిష శాస్త్రం ఒకటి. అందుకే దీన్ని జ్యోతిర్వేదం అని కూడా అంటారు. ప్రాచీన భారతీయ విజ్ఞానములలో ఇది అగ్రగణ్యమైనది. ఈ విజ్ఞానాన్ని రుషి పరంపర నుంచి తాళపత్ర గ్రంధాలలోకి అక్కడ నుంచి సంస్కృత వాజ్ఞయంలోకి ప్రవహించింది. దీని నుంచి మన ప్రాచీనులు ఎంతో శ్రమకోర్చి ఇప్పటి తరానికి అందిస్తూ వచ్చారు. ఈ అద్భుత విజ్ఞానంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. విదేశీయులు సైతం ఆసక్తిగా దీన్ని అభ్యసిస్తున్నారు.
ఈ ప్రాచీన విజ్ఞానంలోని అద్భుత ఫలితాల్ని ఎందరో చవి చూశారు. అప్పట్లో రాజుల కొలువులో ఆస్థాన మంత్రి, ఆస్థాన వైద్యుల తో పాటు ఆస్థాన జ్యోతిషులు కూడా ఉండేవారట. వాతావరణం, పంటలు, స్థితిగతుల్ని అన్నింటినీ ఆ శాస్త్ర వేత్తలు అంచనా వేసి చెప్పగలిగే వారట. పరాశరుడు, వరాహ మిహిరుడు వంటి మహానుభావులు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని లోతుగా మధించి సరళీకరించి అనేక గ్రంథాలు వెలువరించారు. ఈ సాహిత్యంలో చాలా భాగం కాలగమనంలో కలిసి పోయింది. కొద్ది పాటి శాస్త్ర అంశాల్ని మాత్రం అందుకోగలిగాం. ఈ విజ్ఞానానికే ఆధునిక పరిస్థితుల్ని రంగరించి మన పెద్దలు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. తర్వాత కాలంలో దీని నుంచి అనేక శాఖలు ఉద్భవిస్తూ వచ్చాయి. వీటి వివరాలు క్రమంగా చర్చిద్దాం...
ఈ ప్రాచీన విజ్ఞానంలోని అద్భుత ఫలితాల్ని ఎందరో చవి చూశారు. అప్పట్లో రాజుల కొలువులో ఆస్థాన మంత్రి, ఆస్థాన వైద్యుల తో పాటు ఆస్థాన జ్యోతిషులు కూడా ఉండేవారట. వాతావరణం, పంటలు, స్థితిగతుల్ని అన్నింటినీ ఆ శాస్త్ర వేత్తలు అంచనా వేసి చెప్పగలిగే వారట. పరాశరుడు, వరాహ మిహిరుడు వంటి మహానుభావులు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని లోతుగా మధించి సరళీకరించి అనేక గ్రంథాలు వెలువరించారు. ఈ సాహిత్యంలో చాలా భాగం కాలగమనంలో కలిసి పోయింది. కొద్ది పాటి శాస్త్ర అంశాల్ని మాత్రం అందుకోగలిగాం. ఈ విజ్ఞానానికే ఆధునిక పరిస్థితుల్ని రంగరించి మన పెద్దలు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. తర్వాత కాలంలో దీని నుంచి అనేక శాఖలు ఉద్భవిస్తూ వచ్చాయి. వీటి వివరాలు క్రమంగా చర్చిద్దాం...
అస్తు
ReplyDelete